త్వరలోనే అల్లూరి భవనం నిర్మిస్తాం – మంత్రి కేటీఆర్

-

అధికారికంగా త్వరలోనే అల్లూరి భవనం నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ట్యాంక్ బండ్ పై అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులర్పించారు మంత్రి కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, పలువురు గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు. వీరుడు ఎక్కడ పుట్టిన …వీరుడేనని.. రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

జల్ …జంగల్ …జమీన్.. కొమరం భీమ్ పోరాడారు…అల్లూరి కూడా బ్రిటిష్ వారిపై పోరాడారని గుర్తు చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా 8 ఏళ్ళుగా తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని.. క్షత్రియుల కోసం స్థలం అడిగారు… క్షణం ఆలోచించకుండా మూడు ఎకరాల భూమిని కేసీఆర్ కేటాయించారన్నారు. అతి త్వరలోనే భవన నిర్మాణం పూర్తిచేసుకుని దానికి అల్లూరి పేరు పెట్టడమే సముచితమని వెల్లడించారు మంత్రి కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news