ఈనెల 9న గ్రేటర్ వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన

-

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు కేటీఆర్‌ వరంగల్ జిల్లా పర్యటన ఖరారు అయింది. ఈ నెల 9న గ్రేటర్ వరంగల్ లో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ తరుణంలోనే వరంగల్‌ నగరంలో పర్యటించి కేటీఆర్ టూర్ ఏర్పాట్లను పరిశీలించారు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్.

కుడాలో మున్సిపల్ అధికారులతో పాటు ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, నరేందర్, ఎమ్మెల్సీ సారయ్య, మేయర్ గుండు సుధారాణితో సమీక్షా నిర్వహించారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా కాళోజీ కళాక్షేత్రాన్ని కేటీఆర్ ప్రారంభిస్తారని.. మూడు కోట్లతో 19 జంక్షన్ లను అభివృద్ధి చేస్తున్నామని ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. నగరంలో నిరుపేదలకు స్వంత ఇంటికళ నెరవేర్చేలా 9 అంతస్థులతో అపార్ట్మెంట్ ల నిర్మాణం చేపడుతాం…నగరంలో ముంపు ముప్పు నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news