కోమటిరెడ్డి బ్రదర్స్ పొలిటికల్ లైఫ్ ఫినిష్ : మంత్రి తలసాని

-

కోమటిరెడ్డి బ్రదర్స్ పై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. మునుగోడు ఉపఎన్నిక తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్‌కు రాజకీయ జీవితం కనుమరుగేనని అన్నారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టి బీజేపీలో చేరారని మండిపడ్డారు.

ఉప ఎన్నికకు కారకుడైన రాజగోపాల్‌ రెడ్డిని అడుగడుగున ప్రజలు నిలదీస్తున్నారని మంత్రి తలసాని అన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పకుండా ఓట్లు ఎలా అడుగుతున్నారని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న గొర్రెల పంపిణీ పథకాన్ని బీజేపీ నాయకులు అడ్డుకుని గొల్ల కురుముల పొట్ట కొట్టారని ఆరోపించారు.

ముఖ్య మంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ కు శ్రీరామరక్ష అని మంత్రి తలసాని అన్నారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు అడ్డదారులు తొక్కుతున్న బీజేపీ నాయకుల వద్ద కోట్ల రూపాయలు అధికారుల తనిఖీల్లో దొరుకుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి భయంతో అరాచకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news