సీఎం కేసీఆర్ కి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ

-

సీఎం కేసీఆర్ కి లేఖ రాశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి. హోంగార్డులను పర్మనెంట్ చేయాలనీ సీఎం కేసిఆర్ కి లేఖ రాశారు. రాష్ట్రంలో 16 వేల మంది హోం గార్డు లు పని చేస్తున్నారని..గతంలో సిఎం కేసీఆర్ హోంగార్డులను పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చారని, అలాగే వారు ఎక్కడ విధులు నిర్వహిస్తే అక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామన్నారని, సిఎం కేసిఆర్ చెప్పిన మాటనే ఈ లేఖ ద్వారా గుర్తు చేస్తున్నానని అన్నారు.

ఇటీవలే జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడ ఈ అంశం ప్రస్తావనకి తీసుకొని రావడం జరిగిందన్నారు జగ్గారెడ్డి. పర్మనెంట్ చేస్తే వారికి అన్ని బెనిఫిట్స్ వస్తాయన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు అవుతుందన్నారు. అందుకే ఈ లేఖ ద్వారా మీకు మరోసారి హోంగార్డుల సమస్యను దృష్టికి తీసుకొస్తున్నానన్నారు. హోంగార్డులను పర్మనెంట్ చేసే విధంగా జీవో తీసుకొని రావాలని కోరుతున్నానని లేఖలో పేర్కొన్నారు జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news