ఐటీ గురించి అరవింద్ లాంటి లూటీ గాళ్ళకు ఏం తెలుసు? – ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

-

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అరవింద్ ఓ వీటి గుండా అని.. పసుపు బోర్డు గురించి అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రాజకీయాలలో ఎంపీ అరవింద్ ఓ కుసంస్కారి అని అన్నారు. డి శ్రీనివాస్ కు రాజ్యసభ సీటు ఇచ్చింది కేసీఆరే నని గుర్తు చేశారు. అరవింద్ తాగే నీళ్లు, నడిచే రోడ్డు కెసిఆర్ వేసిందేనని అన్నారు.

అరవింద్ అడ్డ గాడిదలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కెసిఆర్ కుటుంబం పై నోరు పారేసుకోవద్దని.. తెలంగాణ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ దావోస్ వెళ్లి ఏం చేశారో అరవింద్ కి తెలియదా? అని ప్రశ్నించారు. ఐటీ గురించి అరవింద్ లాంటి లూటీ గాల్లకు ఏం తెలుసు అని ఎద్దేవా చేశారు. అరవింద్ ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news