పార్టీ మార్పుపై వచ్చిన వార్తలను ఖండించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఇప్పుడు చాలా రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నిత్యం కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అయితే కాస్త ఎక్కువ అనే చెప్పాలి. ఇటీవలే హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కళ్యాణలక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేయకూడదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మార్వోకి సూచించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం విధితమే.

అయినప్పటికీ అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో న్యూస్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పార్టీ మారుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించారు కౌశిక్ రెడ్డి. తాను పార్టీ మారుతున్నానని వచ్చిన వార్తలు అన్ని ఫేక్ అని ఖండించారు  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారితో, బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటా.. ఇలాంటి చిల్లర వార్తలు రాసే మీడియా మీద పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news