జీవన్ రెడ్డి పై పోటీ అంటే మైసమ్మ ముంగట మేకపోతును కట్టేసినట్టే – ఎమ్మెల్సీ కవిత

-

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై ప్రశంసలు కురిపించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నేడు నిజామాబాద్ జిల్లా మక్లూర్ లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డి తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని.. ఆయనపై పోటీ చేయడం అంటే మైసమ్మ ముందట మేకపోతును కట్టేసినట్టేనని అన్నారు.

దేశంలో ఇప్పటివరకు ఎవరు చేయలేనని మంచి పనులు సీఎం కేసీఆర్ చేశారని అన్నారు. జరిగిన అభివృద్ధిని ప్రజలలోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 22 ఏళ్లుగా ప్రజల కోసమే బిఆర్ఎస్ పనిచేస్తుందని.. ఎంతోమంది కార్యకర్తలు పార్టీ కోసం జీవితాలను త్యాగం చేశారని అన్నారు. వారి త్యాగాల ఫలితమే కాలేశ్వరం జలాలు అని పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత. ఒకప్పుడు గులాబీ కండువా కప్పుకుంటే ఎగతాళి చేసే వారిని.. కానీ ఇప్పుడు గులాబీ కండువా కప్పుకున్నందుకు గర్వపడుతున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news