తెరాస నుంచి నర్సంపేట మున్సిపల్ ఛైర్మన్ సస్పెండ్​

-

నాయకుల పుట్టిన రోజుల నిర్వహణలో కొందరు అధికారులు, ప్రజాప్రతినిధుల అత్యుత్సాహం వారి కొంపనే ముంచుతోంది. ఇటీవల కేటీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన పుట్టిన రోజు వేడుకలకు హాజరు కాలేదని ఓ అధికారి ఇద్దరు ఉద్యోగుల్ని సస్పెండ్ చేసి ఆఖరికి ఆయనే సస్పెండ్ అయ్యారు. ఇలాంటి పనే చేసిన నర్సంపేట మున్సిపల్ ఛైర్మన్ మురళీ యాదవ్​ను సస్పెండ్ చేస్తూ మెదక్ జిల్లా తెరాస అధ్యక్షురాలు పద్మాదేవేందర్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు.

వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యేగా టీఆర్ఎస్‌కు చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ కూడా టీఆర్ఎస్ పార్టీ అధీనంలోనే ఉంది. ఆరో తేదీన అంటే శనివారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ఎవరిదన్నదానిపై స్పష్టత లేకపోయినా అధికారికంగా.. సమావేశం నిర్వహించాలన్న ఆదేశాలు మాత్రం మున్సిపల్ కమిషనర్ ఇవ్వాలి. ఆ ప్రకారం ఆదేశాలు వెలువడ్డాయి.

ప్రతి ఒక్క వార్డు సభ్యుడు, సభ్యురాలికి ఈ ఆదేశాలు వెళ్లాయి. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నందున అందరూ తప్పక రావాలని ఆదేశాల్లో ఉంది. ఈ ఆదేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎక్కడైనా సమావేశాలు నిర్వహిస్తారు కానీ ఇలా పుట్టినరోజు వేడుకల కోసం నిర్వహిస్తారా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై స్పందించిన మెదక్ జిల్లా తెరాస అధ్యక్షురాలు మురళీ యాదవ్​ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news