ఎన్డీఏ ప్రభుత్వం విద్వేషాలు రెచ్చగొట్టే విధానంలో ఉంది – VH

-

దేశంలో విద్వేషాన్ని తగ్గించి ప్రేమను పెంచాలన్న శక్తి మహాత్మా గాంధీ కె ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. ఎన్డీయే ప్రభుత్వం విద్వేషాలు రెచ్చగొట్టే విధానంలో ఉందన్నారు. మహాత్మా గాంధీ త్యాగం, ఆలోచనలు ఒక సెంటర్ ఉండాలని గాంధీ ఐడియాలజీ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. 1983 లో వైస్సార్ ఏపీ ఉమ్మడి కాంగ్రెస్ అద్యక్షుడు గా ఉన్నప్పుడు పదిన్నర ఎకరాలు యావత్ భారత్ దేశానికి ఉపయోగపడుతుందని అది ఏర్పాటు చేశారని అన్నారు.

దానికి వైస్సార్ కి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానన్నారు. ఆయన లేకున్నా ఆయన చేసిన ఈ మంచి పని ఇంకా గుర్తుందన్నారు విహెచ్. రాజివ్ గాంధీ సద్భావన యాత్ర లా రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర జరుగుతుందన్నారు. బోయినపల్లి లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని.. మహాత్మా గాంధీ చేసిన త్యాగాలను ఈరోజు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. అందుకు ఈ నాలెడ్జ్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎన్డీయే పాలన లో త్యాగం చేసిన వారిని పక్కన బెట్టి ఎం చేయని వారిని పైకెత్తుతున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news