హైదరాబాద్ లో కొత్త మోసం…! తస్మాత్‌ జాగ్రత్త

-

ఒక పక్క లాక్ డౌన్ లో జనాలు ఇబ్బందులు ఆర్ధికంగా ఎన్ని పడుతున్నా సరే మోసాలు మాత్రం ఏ విధంగా కూడా ఆగడం లేదు అనే చెప్పాలి. తాజాగా హైదరాబాద్ లో డబ్బున్న వాళ్ళను టార్గెట్ చేస్తూ చేసే ఒక వ్యాపారాన్ని గుర్తించారు అధికారులు. హైదరాబాదులో జుంబా డాన్స్ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు కొందరు. బాగా డబ్బు ఉన్న ఉన్నత స్థాయి మహిళా ఉద్యోగులతో పాటుగా…

సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసే వారిని అదే విధంగా డబ్బున్న వారి పిల్లలను అలాగే ప్రముఖుల పిల్లలలో ఉన్న కొన్ని ఇష్టాలను క్యాష్ చేసుకోవడానికి గానూ జుంబా డాన్స్ ను ఎన్నుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కొందరు దీనిపై ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చాలా మంది మహిళలు ఫిట్ నెస్ కోసం గానూ ఈ జుంబా డాన్స్ వైపు ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు.

హైదరాబాద్ లో ధనికులు ఎక్కువగా ఉండే మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఉన్న ప్రముఖులను టార్గెట్ చేసి ఈ వ్యాపారం చేస్తున్నారు. జుంబా డాన్స్ పేరుతో లక్షల రూపాయలను మహిళల నుంచి వాళ్ళు వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫిర్యాదు తో రంగంలోకి దిగిన పోలీసులు వారు అందరిని కూడా అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news