తెలంగాణాలో మరో భారీ అగ్ని ప్రమాదం

-

తెలంగాణా,బొంతపల్లి పారిశ్రామిక వాడ ఓ గోడౌన్ లో  మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం ఎడమగట్టు ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయి ఒక్క రోజు కూడా కాకుండానే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి పారిశ్రామిక వాడలో గల డ్రమ్ముల గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రసాయనల‌తో కూడిన‌ డ్రమ్ములు ఉండడం వలన మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయ‌ని స‌మాచారం.ఐదు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అడుపుచేయడానికి ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. కిలో మీట‌ర్ల మేర పొగ వ్యాపించింది.మంటలు భారీగా చెలరేగుతున్నాయి. అయితే లోపల ఎవరయినా చిక్కుకున్నారా ? లేదా అనే వివరాలు అందాల్సి ఉంది.

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని ప్యానల్‌ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగసి పడడంతోనే ప్రమాదం జరిగిందని తెలంగాణ విద్యుత్‌ శాఖ ప్రకటించింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా వెల్లడించింది. 900 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి 10.30 గంటలకు అగ్ని ప్రమాదం జరిగిందని, ప్రమాదం పసిగట్టిన ఉద్యోగులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపింది. రాత్రి 12 గంటల వరకు ఉద్యోగులు తమ ప్రయత్నాలు కొనసాగించారని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news