గురుకుల విషయంలో కేటీఆర్ ట్వీట్ పై స్పందించిన పరిగి ఎమ్మెల్యే

-

గురుకుల విషయంలో కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ కు స్పందించారు పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. గురుకులాలో విద్యార్థుల అనారోగ్యంపై వస్తున్న వార్తలు ఫేక్ న్యూస్ అన్నారు పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం బండ వెల్కిచర్ల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను సందర్శించారు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 120 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారన్న విషయం అవాస్తవమని అన్నారు.

ఆరు మంది విద్యార్థులు మాత్రమే వైరల్ ఫీవర్ తో అనారోగ్యానికి గురైనట్లు వారు కూడా తమ ఇంటికి వెళ్లారన్నారు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. గురుకుల లో పరిశుభ్రత విషయంలో ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు ఎమ్మెల్యే. సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని ప్రిన్సిపాల్ ని కోరారు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news