రాజేంద్రనగర్ లో పోలీసుల తనిఖీలు.. రూ.20లక్షల విలువైన MDMA డ్రగ్స్ స్వాధీనం

-

రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను సమూలంగా నిర్మూలించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం  ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మాదక ద్రవ్యాలతో రెడ్ హ్యాండెడ్ గా  ఎవరు పట్టుబడినా.. వారిని కఠినంగా శిక్షించాలంటూ పోలీసు శాఖకు ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు టాస్క్ఫోర్స్, ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.

ప్రధానంగా  బస్టాండ్, రైల్వే స్టేషన్లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేపడుతున్నారు. ఈ తనీఖీలలో  గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు బుక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ సన్ సిటీ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ మహిళ, యువకుడు అక్రమంగా తరలిస్తున్న 270 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సరుకు విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి స్టేషన్కు
తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news