పొంగులేటి – జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే: ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

-

గత కొద్ది రోజులుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – జూపల్లి కృష్ణారావులు బిజెపిలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరి చేరికపై కీలక వ్యాఖ్యలు చేశారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. పొంగులేటి – జూపల్లి బిజెపిలో చేరడం కష్టమేనని కుండబద్దలు కొట్టారు. ఇప్పటికే వీరితో ఈటెల రాజేందర్ పలుమార్లు భేటీ అయినప్పటికీ.. వీరు మాత్రం బిజెపిలో చేరడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట.

నేడు హైదరాబాద్ లో ఈటెల మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మంలో బీజేపీ బలంగా లేదని.. కాంగ్రెస్ బలంగా ఉందని అన్నారు. పొంగులేటి, జూపల్లితో రోజు మాట్లాడుతున్నప్పటికీ.. వారే తనకి రిటర్న్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. వారికి బిజెపిలో చేరేందుకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని.. వారిని ఇప్పటివరకు కాంగ్రెస్ లో చేరకుండా ఆపగలిగానని చెప్పుకొచ్చారు. వచ్చే నెలలో వీరు కాంగ్రెస్ లో చేరడం ఖాయమని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news