IASల జీతాల కంటే తెలంగాణ ఉద్యోగుల జీతాలే ఎక్కువ – మంత్రి వేముల

-

IASల జీతాల కంటే తెలంగాణ ఉద్యో గుల జీతా లే ఎక్కువ అని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ కలెక్టరేట్ లో TNGOs డైరీ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,అర్బన్ ఎమ్మేల్యే బిగల గణేష్ గుప్తా.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, టీఎన్జీవో అనేది తెలంగాణ కు మారు పేరు.. టీఎన్జీవోతో బి.ఆర్.ఎస్. కు పేగు బంధమన్నారు. ఉద్యోగుల సి.పి.ఎస్. అనేది కేంద్ర ప్రభుత్వ అంశం..వారికి ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదు..ఆదాయ పన్ను పరిమితి మారుతున్న కాలానికి అనుగుణంగా పెంచాలని ఎన్నిసార్లు కేంద్రానికి చెప్పినా అరణ్య రోదన మారిందని పేర్కొన్నారు. కేంద్రం లో కేసీఆర్ నాయకత్వం వస్తె ఉద్యోగుల సమస్యలు పరిష్కారం…IAS ల వేతనాల కంటే తెలంగాణలో ఉద్యోగుల వేతనాలే ఎక్కువ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news