భద్రాద్రి కొత్తగూడెంలో లేచిపోయిన ప్రేమజంట…ఇరు వర్గాల మధ్య ఘర్షణ

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రేమజంట లేచిపోయింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే…. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం లో రెండు రోజుల క్రితం ఇంటి నుండి వెళ్ళిపోయింది ఓ ప్రేమజంట. ఈ నేపథ్యంలో ప్రేమ జంట కు చెందిన ఇరువురి వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడటంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురికి గాయాలు ఘర్షణలో కారు దగ్ధమైంది.

యువతి కోయగూడెం గ్రామానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి కారు డ్రైవరు కూతురు కాగా యువకుడు అదే మండలం కిష్టారం పంచాయతీ పరిధిలోని రొట్టె గుంపు వాసి కాగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరి ప్రేమ పట్ల యువతికి సంబంధించిన వారు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో యువకుడికి సంబంధించిన వారు కారులో కోయగూడెం రాగా పరస్పర ఘర్షణ జరిగి కారు అద్దాలు ధ్వంసం చేశారు… స్థానికులు వారిని వారించడంతో వివాదం సద్దుమణిగి తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు కారు దగ్ధం చేశారు… ఈ ఘటనతో కోయగూడెం లో ఉద్రిక్తత నెలకొంది సమాచారం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news