జాబ్ కావాలంటే ఆ పని చేయండి.. నిరుద్యోగులకు ప్రియాంక గాంధీ కీలక పిలుపు

-

తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై కాంగ్రెస్కు విజన్ ఉందని ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తెలంగాణకు వచ్చిన ప్రియాంక గాంధీ ఖానాపూర్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గిరిజనులు ఆదివాసుల కోసం ఎంతో చేశారని తెలిపారు ఆదివాసీల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రజలకు మేలు చేయాలని ఇందిరాగాంధీ రాజకీయాలు చేశారని రాజకీయాల్లోకి ఎందరో వస్తారు.. కానీ అందులో కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారని అన్నారు.

ఇందిరాగాంధీ చనిపోయిన ఇప్పటికీ ఆమెను గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. పట్టాల పేరుతో సీఎం కేసీఆర్ ఆదివాసులను మోసం చేశారని మండిపడ్డారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలు తెలిసే సోనియా తెలంగాణ ఇచ్చారు. కాని కేసీఆర్ అధికారంలోకి వచ్చి పదివేలైనా గాని ప్రజల స్వప్నం నెరవేరలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ప్రజల ఆంక్షలు మాత్రం నెరవేరలేదని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రంలో జీవితాలు మారుతాయి అని ఉద్యమకారులు కలలు కన్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని యువతకు కేసిఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని కేవలం ఆయన కుటుంబంలో మాత్రమే నలుగురికి ఉద్యోగాలు ఇచ్చారని ఫైర్ అయ్యారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. జాబు కావాలంటే కెసిఆర్ జాబు తీసేయండి అని కల్వకుంట్ల ఫ్యామిలీ ఉద్యోగాలను పీకేయాలని పేర్కొన్నారు. ఆ పని చేస్తేనే నిరుద్యోగులకు కొలువులు వస్తాయని ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news