షర్మిలకు పువ్వాడ అజయ్ సవాల్.. దమ్ముంటే ఖమ్మంలో పోటీ చేయాలంటూ..

-

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లాలో శుక్రవారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. దమ్ముంటే షర్మిల ఖమ్మంలో పోటీ చేయాలి.నేనేంటో చూపిస్తా అని సవాల్ విసిరారు. పాలేరు లో పోటీ చేసిన మా దమ్ము ఏంటో చూపిస్తానని అన్నారు.

గాలికి వచ్చి పోయే పార్టీ మీది అని ఎద్దేవా చేశారు. తన అన్నతో పంచాయతీ ఉంటే ఆంధ్రాలో చూసుకోవాలని సూచించారు. మీ నాన్న, అన్న డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే టికెట్లు, మంత్రిపదవులు ఇచ్చారని అన్నారు. కెసిఆర్ మాకు ఉచితంగానే మంత్రి పదవులు ఇచ్చారని అన్నారు. ఆంధ్ర పాలకులు ఎన్నాళ్ళు తెలంగాణ ప్రజలను మోసం చేస్తారు? అని ప్రశ్నించారు. తెలంగాణ భూమి మీద మీకు ఏ హక్కు ఉంది?అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news