అమెరికాలో తుపాకుల మోత.. ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్రగాయాలు!

-

అమెరికాలో తుపాకుల మోత మోగుతోంది. వరుస ఘటనలతో అమెరికా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల టెక్సాస్ నగరంలో ఓ పాఠశాలలో చొరబడిన గ్యాంగ్‌స్టర్ జరిపిన కాల్పుల్లో టీచర్‌తోపాటు 20 మంది విద్యార్థులు ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత న్యూయార్క్, ఉవాల్డే నగరాల్లో కాల్పులు జరిగాయి. దీంతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాజాగా మరోసారి గురువారం సాయంత్రం అలబామాలోని ఒక చర్చిలో కాల్పుల మోత మోగింది.

అమెరికా-కాల్పులు
అమెరికా-కాల్పులు

ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. బర్మింగ్‌హోమ్ సబర్బ్ వెస్టావియా హిల్స్‌ లోని సెయింట్ స్టీఫెన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news