చివరి వరకు హోరాహోరి పోరు తప్పదు – కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

-

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. చౌటుప్పల్ మండలంలో మేము అనుకున్న మెజార్టీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటి వరకైతే టీఆరెఎస్ ఆధిక్యంలో ఉందన్నారు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయని.. చివరి వరకు హోరాహోరి పోరు తప్పక పోవచ్చని తెలిపారు. బిజెపి గెలుస్తుందనే నమ్మకం మాత్రం ఉందని చెప్పారు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.

ఇక నాల్గో రౌండ్‌ ముగిసే సరికి టీఆర్ఎస్‌ 26,343, బీజేపీ 25,730, కాంగ్రెస్‌ 8,200, బీఎస్సీ 907 ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్‌కు 613 ఓట్ల ఆధిక్యం లభించింది. దీంతో కౌంటింగ్ కేంద్రం నుండి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బయటకు వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news