తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నిర్మల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకతో పాటే తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. బిజెపి కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికార దుర్వినియోగంతోనే మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ గెలిచిందని విమర్శించారు.

తెలంగాణలో బిజెపికి పెరుగుతున్న ఆదరణతో ముఖ్యమంత్రి కేసీఆర్ లో భయం నెలకొంది అన్నారు రాజగోపాల్ రెడ్డి. కెసిఆర్ కి ఓటమి భయం పట్టుకుందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, ఆ పార్టీలో బలమైన నాయకులే లేరన్నారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వదిలేసి బిజెపిలోకి రావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో గెలవబోయేది బిజెపి పార్టీయే అని జోష్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news