రాజాసింగ్ సస్పెన్షన్ ఒక డ్రామా – మంత్రి జగదీష్ రెడ్డి

-

బిజెపి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి జగదీశ్ రెడ్డి. కావాలనే కవిత ఇంటి పై దాడి చేశారని అన్నారు. టిఆర్ఎస్ క్యాడర్ ను రెచ్చగొట్టాలి అన్నదే వారి వ్యూహమని అన్నారు. ప్రతికార దాడులు జరిపించుకోవాలి అన్నది వారి పధకమని.. ఆరోపణలు చేసేది వారే ..దాడులకు దిగేది వారేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్ద సంస్థలు ఎక్కడా ప్రకటించ లేదు..ఇది బిజెపి ఎంపీ సృష్టించిన రాద్ధాంతం అన్నారు జగదీష్ రెడ్డి. బిజెపి కేంద్రాన్ని అడ్డుపెట్టుకుని ఆడుతున్న నాటకమని ఫైర్ అయ్యారు.

తెలంగాణా లో అలజడికి బిజెపి కుట్ర చేస్తోందని ఆరోపించారు జగదీష్ రెడ్డి. అభివృద్ధిని నిలువరించాలి అన్నదే వారి ఎజెండా అన్నారు. రాజాసింగ్ సస్పెన్షన్ ఒక డ్రామా అన్నారు. టిఆర్ఎస్ భౌతిక దాడులకు దిగితే బిజెపి అడ్రెస్ గల్లంతు అవుతుందన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఆ ఆలోచన కాదని.. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణా దేశానికి రోల్ మోడల్ అని అన్నారు. ఇలాంటి వాటిపై తెలంగాణా సమాజం అప్రమత్తంగా ఉండాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news