RTC బస్సుల్లో ప్రయాణించేవారికి ఊరట..టోల్‌ప్లాజాలపై కీలక నిర్ణయం

-

RTC బస్సుల్లో ప్రయాణించేవారికి ఊరట. సంక్రాంతి సందర్భంగా నడపనున్న బస్సుల కోసం రాష్ట్రంలోని టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక మార్గం ఏర్పాటుకానుంది. పండుగ నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని నెలకొని ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవడంతోపాటు ప్రయాణికులు అధిక సమయం నిరీక్షించాల్సి వస్తుంది.

దీన్ని దృష్టిలో ఉంచుకున్న టిఎస్ఆర్టిసి అధికారులు టోల్ ప్లాజాల వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలని ఎన్ హెచ్ఏఐ అధికారులు, టోల్ ప్లాజాల నిర్వాహకులకు ప్రతిపాదించారు. దీనికి వారు అంగీకరించారు.

ఈ నెల 10 నుంచి 14 వరకు హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-నిజామాబాద్, హైదరాబాద్-వరంగల్ , హైదరాబాద్-సిద్దిపేట తదితర జాతీయ రహదారుల్లోని టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక మార్గ సదుపాయం అందుబాటులో ఉంటుందని టిఎస్ఆర్టిసి మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news