BREAKING : బీజేపీలో చేరిన రిటైర్డ్ ఐపీఎస్ జయచంద్ర

-

BREAKING : బీజేపీలో చేరారు రిటైర్డ్ ఐపీఎస్ జయచంద్ర. ఈ సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. రబ్బరు స్టాంపు మాదిరి ఉండే గవర్నర్లు మాత్రమే బీఆర్ఎస్ కు నచ్చుతారని.. నిజాయితీగా ఉండే గవర్నర్ అధికార బీఆర్ఎస్ కు నచ్చటం లేదని ఆగ్రహించారు.

గవర్నర్ ను హేళనకు గురిచేయడం రాజ్యాంగాన్ని అవమానించటమేనని.. బీఆర్ఎస్ చేస్తోన్న అవినీతిని గవర్నర్ చూస్తూ ఊరుకోవాలా? అని ఆగ్రహించారు. ప్రగతి భవన్ తాగి తినటానికి మాత్రమే కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు కాబట్టే ప్రజలు రాజ్ భవన్ వైపు చూస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రా? మహారాష్ట్రకు ముఖ్యమంత్రా ? అని ఫైర్‌ అయ్యారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news