బీజేపి లోకి నంబర్ వన్ జంప్ అయ్యే వ్యక్తే రేవంత్ రెడ్డి : కేటీఆర్

-

బీజేపి లోకి నంబర్ వన్ జంప్ అయ్యే వ్యక్తే రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ పార్లమెంట్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ నాయకులు విస్మరించారన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంకా అమలు చేయలేదన్నారు. ఇప్పుడు పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారన్నారు.

KTR

రైతు బంధు గురించి అడిగితే తమపై విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రైతులు అడగకుండానే తమ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వచ్చి కరువు తెచ్చిందన్నారు. ముఖ్యంగా  పార్లమెంట్ ఎన్నికల తరువాత తెలంగాణలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. బీజేపి లోకి చేరే మొదటి,నంబర్ వన్ జంప్ అయ్యే వ్యక్తే రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి రాహూల్ గాంధీ మనిశా , మోడీ మనిశా ఆలోచించండి. దమ్ముంటే మీ కాంగ్రెస్ నేతలు చెప్పాలి రేవంత్ ఏ పార్టీ నేత నో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఓటు కాంగ్రెస్ కు వేసిన అది బీజేపీకి పోతది అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news