సెప్టెంబర్ 17పై కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్..!

-

సెప్టెంబర్ 17పై కీలక నిర్ణయం తీసుకున్నది రేవంత్ రెడ్డి సర్కార్.సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.  తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనుంది.

హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 32 జిల్లాల్లో జెండా ఆవిష్కరించే ప్రజాప్రతినిధుల పేర్లను ఖరారు చేసిన ప్రభుత్వం.  గత కొంతకాలంగా సెప్టెంబర్ 17 నిర్వహణపై  వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా పేర్కొంటూ హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో అధికారక కార్యక్రమాలు నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా తాజాగా ప్రకటించడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news