రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీ లా ఉంది.. హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీ లా ఉంది అన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు.  తాజాగా ఆయన కోకాపేట లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ నేతలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకున్నారా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా..? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు.

అదే అరికెపూడి గాంధీని ఎస్కార్ట్ లో తీసుకెళ్లారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఈ రకంగా దాడి జరగలేదు. డీజీపీ, పోలీస్ అధికారులను కోరేది ఒక్కటే.. చట్టాన్ని అమలు చేయండి. ప్రభుత్వ పెద్దలు అయినా.. ఎవ్వరైనా న్యాయబద్ధంగా వ్యవహరించాలని కోరుతున్నాం. నిన్న గాంధీని అరెస్ట్ చేస్తే.. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగేది కాదన్నారు హరీశ్ రావు. ఒక సమస్య నుంచి తప్పించుకోవడానికి మరో సమస్య సృష్టిస్తుంటారని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news