నిజంగా నువ్వు హిందువైతే, వేములవాడకు రా – బండికి రోహిత్ రెడ్డి సవాల్

-

భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో బండి సంజయ్ రాలేదు. బండి సంజయ్ మాటలు అబద్దమని మరోసారి రుజువైందని, కరీంనగర్ లోని వేములవాడ లేదంటే తాండూరులో ను భద్రేశ్వరాలయంకు రావాలని ఛాలెంజ్ చేస్తున్నానని పేర్కొన్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. తగ్గేదే లేదు… బీజేపీ నేతల ఆటలు సాగవు.. బీజేపీ నేతలు తమ తప్పును కప్పి పుచ్చుకోవడనికి అనేక రకాల అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఈడి వ్యవహారాన్ని మేము తప్పు బడితే ఎందుకు ఇంత ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవా చేశారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.

కావాలనే బీజేపీ నేతలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో బిజినెస్ మన్ లను, కీలక నేతలను టార్గెట్ చేస్తున్నారు.నాపై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలకు అమ్మవారి దేవాలయం ముందు సవాల్ విరిసిన సంజయ్ ఎందుకు స్పందించడం లేదు.బండి సంజయ్ హిందుత్వం పేరిట ప్రజలని తప్పు దోవ పట్టిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. భాగ్య లక్ష్మి అమ్మవారి దేవాలయనికి సంజయ్ రాలేదంటే నీ తప్పును నువ్వు ఒప్పుకున్నట్లు… రఘునందన్ ఆరోపణలు చేసిన రిస్టార్ దగ్గర వాచ్ మెన్ పదవి ఇప్పిస్తా… 15 రోజులు పనిచేసి నా ఆస్తి అవునో కాదో తేల్చి చెప్పు అంటూ సవాల్ చేశారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news