BREAKING : తిరుపతి వెళుతుండగా విషాదం.. RTC బస్సు బోల్తా…ఏకంగా 15 మంది ప్రయాణికులు !

-

తెలంగాణ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా కొత్తకోట దగ్గర హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో.. బస్సులో 25 మంది దాకా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

ఇక ఇందులో 15 మందికి గాయాలు అయినట్లు సమాచారం. మరో ముగ్గురి పరిస్థితి విషమం గా ఉంది. ఇక క్షతగాత్రులను వనపర్తి ఆస్పత్రికి తరలించారు పోలీసులు. యాదగిరి గుట్ట నుండి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news