కేసిఆర్, కేటీఆర్ లు ఎలక్షన్ టూరిస్ట్ లు : సీతక్క కౌంటర్‌

-

కేసిఆర్, కేటీఆర్ లు ఎలక్షన్ టూరిస్ట్ లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క కౌంటర్‌ ఇచ్చారు. హనుమకొండ డీసీసీ భవన్ లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ…. రాహుల్ రాకతో కేసిఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి… ఎన్ని అడ్డంకులు పెట్టినా సభ విజయవంతమైందని విమర్శించారు.

పీకే రిపోర్ట్ లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం ఉందని.. రాజు ఎవరో, రాజరిక పాలన ఎలా వుంటుందో కేసిఆర్ పాలన చూస్తే తెలుస్తుందని ఫైర్‌ అయ్యారు. ప్రధాని పదవికి అవకాశం ఉన్నా కార్యకర్తలా పనిచేసిన వ్యక్తి రాహుల్ గాంధీ అని… విద్యార్థుల త్యాగాల ముందు టీఆర్ఎస్ త్యాగాలు ఎంత అని ప్రశ్నించారు.

అమరుల కుటుంబాలకు అన్యాయం చేసింది కేసిఆర్ ప్రభుత్వమని… పదవులు వద్దనుకున్నది రాహుల్ గాంధీ, పదవులు లేకుండా బతకలేనిది కేసిఆర్ కుటుంబమని నిప్పులు చెరిగారు. యువరాజులాగా బతుకుతున్న వారెవరో తెలంగాణ ప్రజలకు తెలుసు…కేసిఆర్, కేటీఆర్ లు ఎలక్షన్ టూరిస్ట్ లు అన్నారు. ఎన్నికల కోసమే కేసిఆర్, కేటీఆర్ పర్యటనలు చేస్తారని… దేశంలో రైతుల దీక్షకు సంపూర్ణ మద్దతు, భరోసా ఇచ్చింది రాహుల్ గాంధీ అని కొనియాడారు.కానీ బీజేపీతో కలిసి టీఆర్ఎస్ రైతుల ఉసురు తీసిందని.. ఉద్యమంలో లేని ప్రకాష్ రాజ్ ను అంటే టీఆర్ఎస్ కు పౌరుషం ఎందుకు? అని ఫైర్‌ అయ్యారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news