శంషాబాద్ లో దారుణం.. కారు ప్రమాదంలో తెగిపడ్డ తల

-

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని కారు ఢీ కొట్టడంతో.. కారు అద్దంలో ఇరుక్కుపోయిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో కారు వెనకాల సీట్ లో మృతుడి తల తెగిపడటంతో భయాందోళన వాతావరణ నెలకొంది. మృతుడు శంషాబాద్ మున్సిపాలిటీ ఉట్ పల్లి గ్రామానికి చెందిన తోట్ల అంజయ్య గా గుర్తించారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అంజయ్య అనే వృద్ధుడు రోడ్డు పై వెళుతున్నాడు.

మితిమీరిన వేగంతో కారు ఒక్కసారిగా అంజయ్యను ఢీ కొట్టింది. దీంతో అంజయ్య అద్దంలో ఇరుక్కుపోయాడు. కారు ఓవర్ స్పీడ్ ఉండటంతో ఆపకుండానే కారులో ఉన్న వ్యక్తి అలాగే నడిపాడు. దీంతో అంజయ్య మొడ తెగి కారు వెనకాల సీట్ లో పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంజయ్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అంజయ్య మృతితో కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news