కేసీఆర్ తన ఓటమి ఒప్పుకున్నట్టే : షబీర్ అలీ

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటమిని ఒప్పుకున్నట్టేనని షబీర్ అలీ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి పలు ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ కి పాజిటివ్ గా చూపిస్తున్నాయి. కేవలం ఒకటి మాత్రమే బీఆర్ఎస్ కి పాజిటివ్ గా చూపించిందని తెలిపారు.

ఇక ఈ ఎన్నికల్లో బాగా పనిచేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అన్ని మతాలు, కులాల సంఘాలు, ఎన్జీవో ఉద్యోగులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చాలా రోజుల నుంచి కాంగ్రెస్ గెలుస్తుందనే చెబుతూ వచ్చారు. దీపం మారిపోయే ముందు వెలుగు ఎక్కువ. డిసెంబర్ 04న కేబినెట్ భేటీ కావడం.. చూస్తుంటే కచ్చితంగా కేసీఆర్ ఓటమి ఒప్పుకున్నట్లు అర్థం అయిపోయింది. మెజారిటీ, మైనారిటీ అనేవి ఉండవు. నేను అందరి వాడిని, అందరితో ఉంటానని తెలిపారు. మరోవైపు కేసీఆర్ మాత్రం బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news