సీఎం కేసీఆర్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు… దోచుకుంటున్న దొంగ అంటూ !

-

సీఎం కేసీఆర్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. దోచుకుంటున్న దొంగ అంటూ కెసిఆర్ పై ఫైర్ అయ్యారు షర్మిల. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, కాళేశ్వరం కమీషన్లతో దేశ రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ బందిపోట్లు ప్రాజెక్ట్ అవినీతిపై కొత్త పాట పాడటం విడ్డూరం అన్నారు. రూ.80 వేల కోట్లతో కట్టిన ప్రాజెక్ట్ లో లక్ష కోట్లు ఎలా తింటం అని చేస్తున్న వితండవాదం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని…తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుతిన్న దొంగలు CAG రిపోర్టునే తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

రూ.62 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ ను అంచనా వ్యయం 1,51,168 కోట్లకు పెంచారని, నెలకు రూ.2,100 కోట్లు ఎలా కడతారని కాగ్ తూర్పారపడితే.. సమాధానం చెప్పే దమ్ము లేదు కానీ.. ప్రశ్నించే వారిపై అక్కసు వెళ్లగక్కడం మాత్రమే BRS దొంగలకు తెలుసు అని చెప్పారు. YSR హయాంలో రూ.38 వేల కోట్లతో పూర్తి కావాల్సిన అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ ను రీడిజైన్ చేసి, రూ.1.51 లక్షల కోట్లకు అంచనా వ్యయం పెంచారు… రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేకపోయారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కట్టిన ప్రాజెక్టు మూడేండ్లకే మునిగిపోతే కనీసం విచారణ కూడా చేపట్టలేదని వెల్లడించారు. మరి లక్ష కోట్లతో ఎవరి జేబులు నింపినట్టు? ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి మేలు జరిగినట్టు? కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన ఖర్చుకు, దాని వల్ల జరుగుతున్న ప్రయోజనాలకు పొంతనే లేదని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news