బంగారు తెలంగాణలో సర్పంచులు బిచ్చమెత్తుకుంటున్నారు – షర్మిల ట్వీట్

-

కెసిఆర్ సర్కార్ పై మరో సారి షర్మిలా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గారి బంగారు తెలంగాణలో సర్పంచులు బిచ్చమెత్తుకుంటున్నారని ఫైర్ అయ్యారు. వడ్డీకి పైసల్ తెచ్చి, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు ఇటు జీతాలు రాక, అటు చేసిన పనులకు బిల్లులు రాక ఊర్లో అడుక్కొంటున్నరు, మీరు రూపాయి ఇవ్వకుండా, సర్పంచుల రక్తం తాగుతూ పనులు చేపించుకొని, డబ్బులు ఇవ్వరా? అని నిలదీశారు షర్మిల.


ధనిక రాష్ట్రం అని గప్పాలు కొట్టే కేసీఆర్ గారు అప్పుల కుప్ప చేశారని అగ్రహించారు. గ్రామ పంచాయతీలకు ఇవ్వడానికి పైసల్ లేవు. ఉద్యోగుల జీతాలకు పైసల్ లేవు. వడ్లు కొనేందుకూ పైసల్ లేవు. కొత్త పెన్షన్లు ఇవ్వడానికీ డబ్బులు లేవని విమర్శించారు. సంక్షేమ పథకాలకూ డబ్బులు లేవు. కమీషన్ల కాళేశ్వరానికి మాత్రం కొదవలేదని మండిపడ్డారు.మ‌ద్ద‌తు ధ‌ర అంటే రైతుల‌కు లాభ‌మొచ్చే ధ‌ర కాదు. క‌నీస ధ‌ర మాత్ర‌మే. అది కూడా ఇవ్వ‌లేని దిక్కుమాలిన ప్ర‌భుత్వ‌మిదని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news