మరికాసేపట్లో నిర్మల్ జిల్లాకు బండి సంజయ్

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు తెలంగాణ హై కోర్టు అనుమతి ఇచ్చింది. బండి సంజయ్‌ పాదయాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. బైంసా సిటీకి 3 కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహిస్తేనే అనుమతించాలన్న కోర్టు… బైంసా సిటీలోకి వెళ్లకుండా పాదయాత్ర కొనసాగించాలని సూచనలు చేసింది.

ఇక హైకోర్టు తుది తీర్పు నేపథ్యంలో మరికాసేపట్లో నిర్మల్ జిల్లాకు బయలుదేరనున్నారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సాయంత్రం వరకు బైంసా ప్రాంతానికి వెళ్ళనున్నారు. ఈరోజు సాయంత్రం పాదయాత్ర చేపట్టే యోచనలో బండి సంజయ్ ఉన్నట్లు సమాచారం. దీనిపై నేతలతో మరోసారి సమాలోచనలు చేస్తున్నారు బండి సంజయ్. ఇక కరీంనగర్ ఎంపీ కార్యాలయం ముందు బిజెపి శ్రేణులు టపాకాయలు కాల్చి సంబరాలు చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news