కేటీఆర్‌కు టాలీవుడ్ సపోర్ట్.. మోదీకి సుద్దాల అశోక్ తేజ లెటర్

-

చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని మోదీకి స్వహస్తాలతో పోస్టు కార్డు రాశారు. అలాగే ప్రతి ఒక్కరు మోదీకి లేఖ రాయాలని పిలుపునిచ్చారు. మోదీపై కేటీఆర్ ప్రకటించిన ఈ పోరాటానికి ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు మద్దతునిచ్చారు. తాజాగా టాలీవుడ్ కూడా కేటీఆర్ కు సపోర్ట్ గా నిలిచింది.

సినీ రంగం నుంచి కేటీఆర్ ఉద్యమానికి మద్దతు లభిస్తోంది. తాజాగా టాలీవుడ్ ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ కూడా కేటీఆర్ పోస్ట్ కార్డ్ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ తన చేతులతో స్వయంగా ప్రధాని మోదీకి ఉత్తరం చేశారు.

చేనేత ఉత్పత్తుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, అనేక కార్యక్రమాలు చేపడుతోందని సుద్దాల అశోక్ లేఖలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేనేత కార్మికులతో స్వయంగా చీరలు తయారు చేయించి బంతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. చేనేత రంగాన్ని కాపాడేందుకు కేటీఆర్ చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news