ఎంపీ రఘురామకృష్ణ రాజు భద్రతా సిబ్బంది సస్పెన్షన్

-

వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు నివాసం వద్ద జరిగిన ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సుభాని రెక్కీ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. కానిస్టేబుల్ సుభానిని రఘురామరాజు భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంట్లోకి చొరబడేందుకు యత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని రఘురామరాజు భద్రతా సిబ్బంది చెబుతున్నారు. అయితే రోడ్డు పక్కన ఉన్న తతను కారులో బలవంతంగా తీసుకెళ్లారని సుభాని చెబుతున్నారు.

ఈ క్రమంలో ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ఘటనకు చెందిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. రోడ్డు పక్కన ఉన్న సుభానిని రఘురామకృష్ణరాజు భద్రతాసిబ్బంది బలవంతంగా కారులో కి తీసుకెళ్తున్నట్లు అందులో కనిపిస్తోంది. ఈ ఘటనపై స్పందించిన నోయిడా 221 బెటాలియన్ కమాండెంట్ సిఆర్పిఎఫ్ కు చెందిన ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్కు గురైన వారిలో ఏఎస్ఐ గంగారం, కానిస్టేబుల్ సందీప్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news