సుప్రీంకోర్టు జడ్జీలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు..!

-

ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజలకు ఢీల్లి లిక్కర్ కేసుపై స్పష్టత వచ్చింది. అయితే ఈ ఢీల్లి లిక్కర్ కేసు రాజకీయ ప్రేరేపిత కేసు. అప్రూవర్స్ అంటే ఒకరు ఇద్దరు వుంటారు.. కానీ ఢీల్లి లిక్కర్ కేసులో 11 మంది అప్రూవర్లుగా మారారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటి వరకు ఏం రికవరీ చేయలేకపోయారు. ఇక సుప్రీంకోర్టు తీర్పును ప్రశ్నించే విధంగా బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు.

సుప్రీంకోర్టు జడ్జీలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా BRS శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. ఢీల్లి లిక్కర్ కేసులో చాలామందికి బెయిల్ ఇచ్చారు. కవితకు బెయిల్ ఇవ్వడంలో అభ్యంతరం ఏంటి.. బెయిల్ అడగడం అనేది కవిత హక్కు. ఢీల్లి లిక్కర్ కేసులో ఏం లేదని మేము మొదటి నుండి చెప్తున్నాం. సుప్రీంకోర్టు కేంద్రం చేతిలో ఉన్నట్లు మాట్లాడటం సరికాదు. లాయర్ అనేది వృత్తికి సంబంధించినది. ఇక రేపు కవిత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి హైదరాబాద్ ఇంటికి చేరుకుంటారు అని తలసాని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news