బిజెపి బడా బాబులకు కొమ్ము కాస్తుంది – తమ్మినేని వీరభద్రం

-

యాదాద్రి భువనగిరి జిల్లాలో సిపిఎం పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈడి కవితపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. బిజెపి బడా బాబులకు కొమ్ము కాస్తుంది అన్నారు తమ్మినేని. కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్రంలో బస్సు యాత్రను చేపడతామన్నారు.

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 9 నుండి జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ బస్సు యాత్రలను ప్రారంభిస్తారని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు కలిసికట్టుగా పనిచేస్తాయన్నారు తమ్మినేని. పార్టీ శ్రేణులు బస్సు యాత్రలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల్లో ఏ విధానాన్ని అయితే అవలంబించామో అదేవిధంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అవలంబిస్తామన్నారు. కేంద్రంలో మతతత్వ పార్టీని ఒడించడమే వామపక్షాల ద్వేయం అన్నారు తమ్మినేని వీరభద్రం.

Read more RELATED
Recommended to you

Latest news