కేసీఆర్‌, కేజ్రీవాల్‌ కూడా లిక్కర్ స్కాంలో ఉన్నారు – తరుణ్ చుగ్

-

కేసీఆర్‌, కేజ్రీవాల్‌ కూడా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్. ఇవాళ నేషనల్‌ మీడియాతో తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, కేజ్రీవాల్‌ పై సంచలన ఆరోపణలు చేశారు. చట్టం ముందు అందరూ సమానులే.. పంజాబ్, తెలంగాణ, ఢిల్లీ సీఎంలు లిక్కర్ స్కాంలో ఉన్నారని ఆరోపణలు చేశారు.

ఢిల్లీ, పంజాబ్ మద్యం పాలసీల్లో అవినీతి జరిగిందని నిప్పులు చెరిగారు తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్. సౌత్ లిక్కర్ మాఫియాతో దేశాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహించారు. ఢిల్లీ మద్యం పాలసీపై మరింత విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్. చట్టం ప్రకారం.. కల్వకుంట్ల కవితకు శిక్ష పడుతుందని తెలిపారు. ఈ విషయంలో.. అధికారులు వారి పని.. వారు చేస్తారని కుండబద్దలు కొట్టి చెప్పారు తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్.

Read more RELATED
Recommended to you

Latest news