ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినేట్‌ భేటీ..వీటిపైనే చర్చ

-

మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ప్రగతి భవన్ లో ప్రారంభం అయ్యే ఈ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధ్యక్షతన జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా వరి ధాన్యం కొనుగోలు అంశంపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. యాసంగి లో వరి సాగు, కొత్త వెరైటీ అలాగే సత్యమే పంటల పై సీఎం కేసీఆర్ మంత్రులతో ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

అలాగే త్వరలో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనున్న నేపథ్యంలో దానిపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా అందరినీ వణికిస్తోంది ఓమిక్రాన్ వేరియంట్. ఈ వేరియంట్‌ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను ఎలా ముందుకు సాగించాలనే దానిపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. వరి సాగుపై రైతులు… తీవ్ర గందరగోళ పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో స్వయంగా సీఎం కేసీఆర్ దీనిపై మాట్లాడనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news