బ్రేకింగ్: తెలంగాణకు చుక్కలు చూపిస్తున్న కరోనా

-

తెలంగాణాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ప్రతీ రోజు కూడా కరోనా కేసుల తీవ్రత పెరుగుతుంది. తెలంగాణ లో కొత్తగా 2207 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి చెందారు. 75257 కి చేరింది పాజిటివ్ కేసుల సంఖ్య. మరణాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. సెప్టెంబర్ చివరి నాటికి హైదరాబాద్ లో కేసులు భారీగా పెరిగే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు.

coronavirus
coronavirus

హైదరాబాద్ పరిధిలో 80 నుంచి 90 శాతం పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తెలంగాణాలో ఇప్పటి వరకు 601 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు 21 వేల 417 గా ఉండగా కోలుకున్న వారి సంఖ్య 53 వేల 239కి చేరుకుంది. తెలంగాణాలో రికవరీ రేటు 70.7 శాతంగా ఉంది. రికవరీ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. నిన్న ఒక్క రోజే 23 వేల మందికి కరోనా పరిక్షలు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news