సెప్టెంబర్ 17న తెలంగాణ ముక్తి దివస్ ఘనంగా నిర్వహిస్తాం.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

-

సెప్టెంబర్ 17న తెలంగాణ ముక్తి దివస్ ఘనంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సాయుధ పోరాటంతో రజాకార్ల నుంచి తెలంగాణకు విమోచనం కలిగిన రోజును ముక్తి దివాస్ గా జరుపుకోవాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

అదేవిధంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు బీజేపీయే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. చైనాలోని కమ్యూనిస్టు పార్టీని మించిన అతిపెద్ద పార్టీ బీజేపీ అని కిషన్ రెడ్డి తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదులో ప్రతీ ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news