ఉద్యోగ నోటిఫికేషన్ పై రేపు కీలక నిర్ణయం.. రేపు కమిషన్ సమావేశం

-

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు టీఎస్పీఎస్సీ సమావేశం అయింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖల్లో ఖాళీల సమాచారం ఇప్పటికే కమిషన్ కు చేరింది. ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కమిషన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అన్నింటి కన్నా ముందుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. 

ఈనేపథ్యంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలపై టీఎస్పీఎస్పీ రేపు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే దశల వారీగా సమావేశం అయిన కమిషన్ శనివారం మరోసారి భేటీ కానుంది. భేటీలో కీలక విషయాలను చర్చించనుంది. గతంలో జరిగిన పొరపాట్లను అధ్యయనం చేసి, మళ్లీ అలాంటి సమస్య రాకుండా చర్యలు తీసుకోనుంది. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే సమావేశం అనంతరం గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news