‘మా వద్ద బిల్లులు పెండింగ్​లో లేవు’.. తెలంగాణ రాజ్​భవన్ క్లారిటీ

-

గత రెండేళ్లుగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య పలు వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పెండింగ్ బిల్లుల వివాదం ఎక్కువగా చర్చనీయాంశమైంది. అయితే తాజాగా ఈ వ్యవహారంపై రాజ్ భవన్ స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వ బిల్లులు గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో లేవని క్లారిటీ ఇచ్చింది. గతంలోనే 3 బిల్లులను గవర్నర్‌ తమిళిసై ఆమోదించారని పేర్కొంది. మరో 2 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపారని తెలిపింది.

ఇక మిగిలిన బిల్లులపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారని రాజ్‌భవన్‌ స్పష్టం చేసింది. ఇటీవల ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన సందర్భంగా బిల్లులు పెండింగ్‌లో పెట్టిన గవర్నర్‌కు మోదీ ఓ మాట చెబితే బాగుండేదని కేటీఆర్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌ పైవిధంగా స్పందించినట్లు తెలిసింది.

‘గవర్నర్ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవు. గతంలోనే 3 బిల్లులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదించారు. మరో 2 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. మిగిలిన బిల్లులపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు.’ – రాజ్‌భవన్‌

Read more RELATED
Recommended to you

Latest news