వైద్యులకు ఎక్కువగా కరోనా సోకే రాష్ట్రాల్లో మొదటి స్థానంలో తెలంగాణా…!

-

తెలంగాణాలో 18 శాతం మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు కరోనా సోకుతుందని కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఓఎస్డీ రాజేష్ భూషణ్ కాసేపటి క్రితం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో, ఆరోగ్య సంరక్షణ కార్మికులలో కరోనా పాజిటివిటీ రేటు 18% అని ప్రకటించారు. ఆ తర్వాత అరోనా కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో ఎక్కువ మందికి కరోనా సోకింది అని చెప్పారు.

మహారాష్ట్రలో 16% శాతం మంది, దేశ రాజధాని ఢిల్లీలో 14% మంది… కర్ణాటకలో 13%, పుదుచ్చేరిలో 12% మరియు పంజాబ్లో 11%. ఆరోగ్య కార్యకర్తలలో కరోన పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందని అయన పేర్కొన్నారు. కాగా దేశంలో మిలియన్ జనాభాకు కేవలం 49 మంది మాత్రమే కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే అత్యల్పంగా ఉందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news