BREAKING : రాకేష్‌ అంతిమ యాత్రలో ఉద్రిక్తత, BSNL కార్యాలయంపై రాళ్ల దాడి

-

వరంగల్ జిల్లా : ఎంజీఎం మార్చురీ నుంచి రాకేష్ అంతిమ యాత్ర కాసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే… రాకేష్‌ అంతిమ యాత్రలో ఉద్రిక్తత నెలకొంది. వరంగల్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంపై రాళ్ల దాడి చేశారు కొంత మంది యువకులు. దీంతో వరంగల్‌ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. లాఠీఛార్జీ జరిపి.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. రాకేష్‌ అంతిమ యాత్ర కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, సహా ఎమ్మెల్యేలు ఎంపీలు వెంట నడవడంతో అంతిమయాత్ర కొనసాగుతోంది.

అంతేకాదు.. రాకేష్‌ పాడేను కూడా మంత్రి ఎర్రబెల్లితో పాటు ఎమ్మెల్యేలు మోశారు. అంతిమ యాత్రకు మద్దతుకు మద్దతు పలికాయి వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, బిఎస్పి. వరంగల్ నగరంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్న యాత్ర అడుగడుగునా పోలీసులు బలగాలు మోహరించాయి.

Read more RELATED
Recommended to you

Latest news