కన్న కూతురిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి

-

పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని బట్టుపల్లి లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న కూతురిని అతి కిరాతకంగా తండ్రి నరికి చంపిన ఘటన సంచలనంగా మారింది. మంథని మండలం బట్టుపల్లి గ్రామంలో కన్న కూతురు రజిత (11) ని తండ్రి గుండ్ల సదయ్య గొడ్డలితో నరికి చంపాడు. చిన్నారిని హతమార్చాక.. అదే గొడ్డలితో మరో దుకాణదారుడిపై దాడి చేశాడు. సమాచారం అందుకున్న మంథని పోలీసులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే గత కొంతకాలంగా సదయ్య మానసిక స్థితి సరిగా లేదని, గ్రామంలో జనాలపై తరచుగా దాడులు చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. అయితే నిందితుడిని పోలీసులు వాహనంలో తరలిస్తున్న క్రమంలో గ్రామస్తులు అడ్డుకున్నారు. నిందితుడిని తామే శిక్షిస్తామంటూ పోలీసు వాహనానికి స్థానికులు ముళ్ళకంపలు అడ్డం వేశారు. పోలీసులపై గ్రామస్తులు దాడికి పాల్పడడంతో పాటు వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో బట్టుపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news