సిగ్గుపడు KCR.. సిగ్గుపడు – వైఎస్‌ షర్మిల

-

 

సిగ్గుపడు KCR.. సిగ్గుపడు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. వడ్లు మొలకెత్తి..గుండె భారమై ఓ కౌలు రైతన్న ప్రాణం పోయింది.చనిపోతానని ముందే చెప్పినా..ఆదుకోని అసమర్థ ప్రభుత్వమిది.కండ్లు ఉన్నా చూడలేని సర్కారు ఇదని తెలిపారు. చెవులు ఉన్నా వినలేని ప్రభుత్వమిది.కేసీఆర్ దొరకు..రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల బాధలు మాత్రం వద్దు.ఓట్ల కోసం.. రైతు నినాదం కావాలన్నారు. కానీ ఆదుకునే విధానం వద్దు.

సిగ్గుపడు KCR.. సిగ్గుపడు. తొమ్మిదేళ్లలో తొమ్మిది వేల మంది రైతులను బలి తీసుకున్న కేసీఆర్.. మరో రైతు ప్రాణం తీసుకోకముందే ఇచ్చిన మాట ప్రకారం ఆఖరి గింజ వరకూ కొను అని డిమాండ్ చేశారు షర్మిల. ఐకేపీ సెంటర్లు అన్ని తెరువు.క్వింటాలుకు 12 కిలోల తరుగు దోపిడీ ఆపు…తడిసిన వడ్లు సైతం కొను అని ఫైర్‌ అయ్యారు. ఇచ్చిన హామీ ప్రకారం కనీసం రూ.10 వేలు నష్ట పరిహారం ఇవ్వు. ఇప్పటికే 2023లో దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినా పంట బీమా కూడా లేని దిక్కుమాలిన పాలన కేసీఆర్ ది అని ఆగ్రహించారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news