హైకోర్ట్ లో పబ్బులపై ముగిసిన విచారణ

-

హైదరాబాద్ లోని పబ్స్ పై హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాత్రి 10 దాటితే ఎటువంటి సౌండ్ పెట్టరాదని హైకోర్టు తేల్చి చెప్పింది. తెల్లవారుజామున 6 గంటల వరకు ఇది వర్తిస్తుందని తెలిపింది. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పొల్యూషన్ రెగ్యులరేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతి ఉంటుందని చెప్పింది.

అలాగే రాత్రిపూట కేవలం లిక్కర్ మాత్రమే సరఫరా చేయాలని స్పష్టం చేసింది. హైదరాబాద్ నగరంలోని ముగ్గురు కమిషనర్లకు హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేటి విచారణలో నివేదికను సీపీలు కోర్టుకు సమర్పించారు. హైకోర్టులో పబ్బుల పై నేటి విచారణ ముగిసింది. పబ్బులలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలంటూ ముగ్గురు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని సూచించింది. ఈ కేసును దసరా సెలవుల తర్వాత విచారణకు వాయిదా వేసింది హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news